అసని తుఫాను మచిలీపట్నం వద్ద తీరం దాటుతుందని ఉన్నతాధికారులు తెలియజేటంతో సముద్ర తీర ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పాలకాయతిప్ప మెరైన్ స్టేషన్ సిఐ వల్లభనేని పవన్ కిషోర్ అన్నారు. బుధవారం సముద్ర తీర ప్రాంత గ్రామాల అయినా హంసలదీవి, పాలకాయతిప్ప, ఉటగుడం, రామకృష్ణ పురం, తదితర గ్రామాల్లో మెరైన్ సిఐ వల్లభనేని పవన్ కిషోర్ తన సిబ్బందితో పర్యటించి మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లరాదని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్ల పాలకాయతిప్పబీచ్ వెళ్ళి సముద్రపు కరకట్ట వద్ద గేట్లు మూసి వేయడం జరిగిందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa