దేశవ్యాప్తంగా పాదయాత్రలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 'భారత్ జోడో యాత్ర' పేరుతో పాదయాత్ర చేపట్టనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదివారం ప్రకటించారు. రాజస్థాన్ లోని ఉదయ్పూర్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న 'నవసంకల్ప చింతన శిబిరం'లో ముగింపు కార్యక్రమంలో సోనియా గాంధీ మాట్లాడారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని అక్టోబర్ 2వ తేదీ నుంచి ఈ పాదయాత్ర కొనసాగుందని సోనియా వెల్లడించారు. కాంగ్రెస్ లోని సీనియర్ల నుంచి జూనియర్ల వరకు అందరూ ఈ యాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa