బీసీలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని కొండపల్లి మున్సిపాలిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. కొండపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీసీ విభాగ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని బీసీలకు అగ్రతాంబూలం ఇస్తుందని పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యులుగా ఆర్. కృష్ణయ్యని, బీద మస్తాన్ రావులను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు నామినేట్ చేయటాన్ని స్వాగతించారు.
గతంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఈ విధంగా బీసీలకు సామాజిక న్యాయం చేయలేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బాటలోనే పయనిస్తూ మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ కూడా నియోజవర్గంలో బీసీలకు పెద్దపీట వేస్తున్నారని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనార్టీలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే సముచిత గౌరవం ఉంటుందని స్పష్టం చేశారు. చప్పట్లు ద్వారా ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa