రామచంద్రపురం మండలం భీమ క్రోసు పాలెం పంచాయతీ , ఉండూరు గ్రామ సచివాలయం నందు ఉపాధి కూలీలకు రెండు పూటలా పని విధానాన్ని రద్దు చేయాలనే పథకాన్ని రద్దు చేసే ఆలోచనల్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని వికలాంగుల గ్రూపును కొనసాగించాలని కూలీలు బకాయిలు తక్షణమే చెల్లించాలని , సమ్మర్ అలవెన్స్ ఇవ్వాలని పథకాన్ని నిర్వీర్యం చేసే విధానాలను తక్షణమే రద్దు చేయాలని ఉపాధి హామీ పథకానికి నిధులు అదనంగా కేటాయించాలని పని దినాలు 200 రోజులకు పెంచాలని రోజుకు 600 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో రెండు గ్రామాల్లో ప్రదర్శన నిర్వహించి కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ దుర్గాప్రసాద్ , జిల్లా అధ్యక్షులు జనపల్లి సత్తిబాబు, జిల్లా నాయకులు గెద్దాడ సూరిబాబు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయాలనే ఉద్దేశంతో రెండు పూటలా పని విధానాన్ని నిధుల్లో కోతలు విధించిందని తక్షణమే కేంద్ర ప్రభుత్వం ప్రజా నిరసనలు దృష్టిలో ఉంచుకొని ఉపాధి కూలీల డిమాండ్లు నెరవేర్చాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం సచివాలయం పంచాయతీ కార్యదర్శులకు వినతిపత్రం ఇచ్చారు ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు మిల్లిమీ రాముడు, కమిడి చందర్రావు, కొండేపూడి వీరస్వామి, మూడే బేబీ, ఖండవల్లి సింహాద్రి, ఉండ్రు మంగ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa