తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా రాజోలు పట్టణానికి చెందిన బోళ్ళ వెంకటరమణ నియమితులయ్యారు. ఈ మేరకు టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. వెంకటరమణ గతంలో తూర్పుగోదావరి జిల్లా తెలుగుయువత కార్యనిర్వాహక కార్యదర్శిగా సేవలందించారు. తెలుగుదేశం పార్టీలో చురుకైన యువ నాయకుడిగా వెంకటరమణ గుర్తింపు పొందారు. రమణ సేవలను గుర్తించిన టిడిపి అధిష్టానం ఆయనకు రాష్ట్ర వాణిజ్య విభాగంలో పదవి ఇచ్చి ప్రోత్సహించింది. ఈ సందర్భంగా బుధవారం నాడు రాజోలులో వెంకటరమణ మీడియాతో మాట్లాడుతూ టిడిపి పటిష్టతకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టి, టిడిపి బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. తనకు ఈ అవకాశం కల్పించిన టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డూండీ రాకేష్, తనను సిఫారసు చేసిన మాజీ మంత్రి, రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు గొల్లపల్లి సూర్యారావులకు బోళ్ళ వెంకటరమణ కృతజ్ఞతలు తెలిపారు.*
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa