భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో బుధవారం స్వామివారి ఉత్సవ పెరుమాళ్లకు బేడా మండపంలో అభిషేక తిరుమంజనం జరిపారు. అలాగే శ్రీరామచంద్రునికి ఆరాధ్య దైవమైన రంగనాయకుల గుట్టపై వేంచేసి ఉన్న శ్రీరంగనాథ స్వామివారికి అభిషేకం నిర్వహించారు. ఆలయ తలుపులు తెరిచి స్వామి వారికి సుప్రభాతసేవ, ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, నిత్య హోమాదులు నిర్వహించారు.
అనంతరం శ్రీసీతా, రామ, లక్ష్మణ ఉత్సవమూర్తులను ప్రాకార మండపంలో వేంచింప చేసి ముందుగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యఃవచనం చేశారు. అర్చకుల వేద మంత్రోచ్ఛరణ నడుమ కన్యాదానం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల వేడుకతో శాస్త్రోక్తంగా నిత్యకళ్యాణం వైభవంగా జరిపించారు. ఈకార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఉద్యోగులు, సిబ్బంది, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
![]() |
![]() |