చైనా మరోసారి భారీ కుట్రకు తెరలేపింది. పాంగాంగ్ సరస్సుపై మరో అక్రమ వంతెన నిర్మాణాన్ని ప్రారంభించింది. దీంతో పాంగాంగ్ ఉత్తర తీరంలోని ఖుర్నాక్ నుంచి దక్షిణ తీరంలో రుటోక్ మధ్య దూరం భారీగా తగ్గింది. గతంలో ఖుర్నాక్ నుంచి రుటోక్కు చేరుకోడానికి చైనా సైన్యం దాదాపు 180 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది. కానీ, వంతెన అందుబాటులోకి రావడంతో అది 40 నుంచి 50 కిలోమీటర్లకు పడిపోయింది. ఇదిలా ఉంటే ఉత్తర, దక్షిణ భాగాలను కలిపేలా గతేడాది చివర్లో వంతెన నిర్మాణం ప్రారంభించి ఇటీవలే పూర్తిచేసిన విషయం తెలిసిందే.
తాజాగా దీనికి సమాంతరంగా భారీ సైనిక వాహనాలు, దళాలను వేగంగా తరలించేందుకు కొత్తగా వంతెన నిర్మిస్తోంది. ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి అవసరమైన భారీ క్రేన్లు, ఇతర సామాగ్రి తరలింపు కోసం ఇటీవల నిర్మించిన వంతెనను ఉపయోగించుకోనుంది. వంతెన నిర్మాణానికి సంబంధించి శాటిలైట్ ఫోటోలు బయటకు వచ్చాయి. విశ్వసనీయ వర్గాలు కూడా దీనిని ధ్రువీకరించాయి. జియో స్పేసియస్ ఇంటెలిజెన్స్ పరిశోధకుడు డామియన్ సిమోన్ ఈ ఫోటోలను ట్విట్టర్లో విడుదల చేశారు. మొత్తం 10 మీటర్ల వెడల్పు.. 450 మీటర్ల పొడవున ఈ వంతెన నిర్మాణం సాగుతున్నట్టు ఫోటోలను బట్టి తెలుస్తోంది.
ఎల్ఎసీ వ్యాప్తంగా చైనా కార్యకలాపాలపై పూర్తిస్థాయిలో నిఘా ఉంచే సిమోనే.. మొదటి వంతెన గురించి కూడా బయటి ప్రపంచానికి తెలియజేశారు. కాగా, తాజా పరిణామంపై భారత్ సైన్యం స్పందించలేదు. అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. తూర్పు లడఖ్లో వాస్తవాధీన రేఖ వెంబడి యథాతథస్థితిని మార్చేందుకు 2020లో డ్రాగన్ ప్రయత్నించింది. ఈ క్రమంలో భారత్-చైనా సైనికులు గల్వాన్ లోయవద్ద ఘర్షణపడ్డారు. అనంతరం అదే ఏడాది ఆగస్టులో పాంగాంగ్ దక్షిణ భాగంలోని వ్యూహాత్మక ప్రాంతాలను భారత్ సైన్యం చేజిక్కించుకుంది. ఈ హఠాత్పరిణామానికి డ్రాగన్ ఖంగుతింది. మరోసారి అలాంటి పరిస్థితే వస్తే సమర్ధంగా ఎదుర్కొనేలా బలగాలను వేగంగా తరలించేందుకు వీలుగా సరస్సుపై ప్రి ఫాబ్రికేటెడ్ వారధిని నిర్మించింది.
దీంతో పాంగాంగ్ ఉత్తర తీరంలోని ఖుర్నాక్ నుంచి దక్షిణ తీరంలో రుటోక్ మధ్య దూరం భారీగా తగ్గింది. గతంలో ఖుర్నాక్ నుంచి రుటోక్కు చేరుకోడానికి చైనా సైన్యం దాదాపు 180 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది. కానీ, వంతెన అందుబాటులోకి రావడంతో అది 40 నుంచి 50 కిలోమీటర్లకు పడిపోయింది. తాజాగా, మరో వంతెనతో భారీ స్థాయిలో సైన్యాలను అత్యంత వేగంగా దక్షిణ భాగానికి తరలించే అవకాశం చైనాకు ఉంటుంది. ఈ నిర్మాణం పూర్తయితే పాంగాంగ్ సరస్సు దక్షిణ తీరంలోని పర్వతాలపై పట్టుసాధించడం భవిష్యత్తులో భారత్కు కష్టమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం సరిహద్దుల్లో ఒక్కో దేశం 50 వేల నుంచి 60 వేల మంది సైనికులను మోహరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa