ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాసేపట్లో పెళ్లనగా వరుడు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 23, 2022, 11:56 AM

పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు అనారోగ్యంతో కన్నుమూశాడు. దీంతో పెద్దలు వధువుకు మరో యువకుడితో వివాహం జరిపించారు. ఈ ఘటన ఏపీలోని కర్నూలు జిల్లాలో జరిగింది. హొళగుంద మండలం గజ్జహల్లి గ్రామానికి చెందిన యువతికి పెద్దకడబూరు మండలం చిన్న తుంబళం గ్రామానికి చెందిన హనీఫ్‌(23)తో వివాహం నిశ్చయమైంది. 


ఆదివారం వివాహం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కాసేపట్లో పెళ్లనగా వరుడు హనీఫ్‌ కు ఛాతిలో నొప్పి వచ్చింది. వెంటనే అతడిని కర్ణాటక రాష్ట్రం శిరగుప్పలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అతను మృతిచెందినట్లు నిర్ధారించారు. అనంతరం వధువు తల్లిదండ్రులు తమ సమీప బంధువైన హొళగుంద మండలం వందవాగిలి గ్రామానికి చెందిన నబిరసూల్‌ తో యువతి వివాహం జరిపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa