ట్విట్టర్ భవిత్వం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారిందా అంటే అవుననే అంటున్నారు ఆర్థిక నిపుణులు. టెస్లా సీఈవో, స్పేస్ ఎక్స్ వ్వవస్థాపకుడు ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలుపై మరోసారి ట్విస్ట్ ఇచ్చారు. సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్లో స్పామ్ అకౌంట్స్ 5 శాతం కంటే తక్కువగా ఉన్నాయని రుజువు చేస్తేనే ట్విట్టర్ కొనుగోలు ఒప్పందంపై ముందుకు వెళ్తామని ఎలాన్ మస్క్ తేల్చి చెప్పారు. ట్విట్టర్లో కొనసాగుతన్న స్పామ్ అకౌంట్లపై పూర్తి స్పష్టత వచ్చాకే ఒప్పందంపై ముందుకు వెళ్తామని ఈ బిలియనీర్ పునరుద్ఘాటించారు. అంతేగాక, ఫేక్ ఎకౌంట్స్ సాకు చూపి ట్విట్టర్ డీల్ $44 బిలియన్లు చాలా ఎక్కువ అని ఎలాన్ మస్క్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే, ఇంతకంటే తక్కువకే ట్విట్టర్ను పొందాల్సి ఉంటుందన్నారు.
'20% నకిలీ/స్పామ్ ఖాతాలు, అంటే ట్విట్టర్ చెబుతున్న దాని కంటే 4 రెట్లు ఎక్కువ *అధికంగా* ఉండవచ్చు. నా ఆఫర్ Twitter.. SEC ఫైలింగ్లు ఖచ్చితమైనవిగా ఉండటంపై ఆధారపడింది. నిన్న, Twitter CEO <5% రుజువును చూపించడానికి బహిరంగంగా నిరాకరించారు. అతను దీనిపై రుజువు చేసే వరకు ఈ ఒప్పందం ముందుకు సాగదు' అని మస్క్ ట్వీట్ ప్రతిస్పందనలో తెలిపారు.
బాట్, స్పామ్ లేదా నకిలీ ఖాతాలతో పోరాడటానికి మైక్రోబ్లాగింగ్ సైట్ ప్రయత్నాలను వివరిస్తూ వరుస ట్వీట్లను పోస్ట్ చేసిన ట్విట్టర్ CEO పరాగ్ అగర్వాల్ను మస్క్ ట్రోల్ చేశారు. సోమవారం వరుస ట్వీట్లలో, మైక్రో-బ్లాగింగ్ ప్లాట్ఫారమ్ డేటా, వాస్తవాలు, సందర్భంతో స్పామ్, నకిలీ ఖాతాలపై ఎలా పోరాడుతుందో అగర్వాల్ వివరించారు.
అయితే, పరాగ్ అగర్వాల్ వివరణలతో ఎలాన్ మస్క్ సంతృప్తి చెందలేదు. తనకు నమ్మకంగా అనిపించలేదంటూ పూప్ ఎమోజితో థ్రెడ్కు ప్రతిస్పందించారు. "అయితే ప్రకటనదారులు తమ డబ్బు కోసం ఏమి పొందుతున్నారో ఎలా తెలుసుకుంటారు? ఇది ట్విట్టర్ ఆర్థిక ఆరోగ్యానికి ప్రాధాన్యమైనది." అని ఎలాన్ మస్క్ మరో ట్వీట్లో పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa