ప్రధాని నరేంద్ర మోదీ తన రెండు రోజుల పర్యటనలో భాగంగా జపాన్లోని టోక్యోలో సుజుకి మోటార్ కార్పొరేషన్ సలహాదారు ఒసాము సుజుకీని మే 23న కలిశారు.భారతదేశంలో పెట్టుబడులు, ఆవిష్కరణలు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, రీసైక్లింగ్ కేంద్రాలపై అవకాశాలపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సుజుకీ మోటార్ కార్పొరేషన్ సలహాదారు ఒసాము సుజుకీతో సమావేశమయ్యారు. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ జపాన్ చేరుకున్నారు. మే 24న టోక్యోలో జరిగే మూడో క్వాడ్ లీడర్స్ సమ్మిట్లో ఇతర క్వాడ్ సభ్యులతో కలిసి ప్రధాని మోదీ పాల్గొంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa