కుప్పంలో తిరుపతి గంగమ్మ జాతరలో భాగంగా మంగళవారం అమ్మవారి శిరస్సు ఊరేగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ భరత్ పాల్గొన్నారు. ముందుగా అమ్మవారిని దర్శించుకున్న అనంతరం పోలీసులకు జాతర నిర్వహణపై తగు సూచనలు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అమ్మవారి జాతరను పూర్తి చేస్తామని ఈ సందర్భంగా భరత్ వెల్లడించారు. జాతర చరిత్రలో ఇప్పటి వరకు ఇంత మంది భక్తులు రావడం ఇదే మొదటిసారి అని భరత్ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa