రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా ఖచ్చితంగా గెలిచితీరుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఆ గెలవడం మామూలుగా ఉండకూడదని, 160 స్థానాల్లో జయకేతనం ఎగురవేసి చంద్రబాబును సీఎం చేయాల్సిన అవసరముందని ఆయన శుక్రవారం ఒంగోలులో మహానాడు ప్రారంభ సభలో పేర్కొన్నారు. కాగా సామాజిక న్యాయ భేరి పేరిట బస్సు యాత్ర సాగిస్తున్న వైసిపి నేతలను ఆయన ఆలీబాబా నలభై దొంగలతో పోల్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa