యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయ మండపంలో స్వామి, అమ్మవార్లకు నిత్యకల్యాణం సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. మహామంటపంలో ఆలయ అర్చకులు సుదర్శన నారసింహహోమం ఆగమశాస్త్రంగా నిర్వహించారు. ఉదయం 4 గంటలకు తెరిచి అర్చకులు స్వామివారికి సుప్రభాతం, ఆరాధన చేపట్టారు. పంచామృతాలతో అభిషేకించి పట్టువస్ర్తాలు ధరింపజేసి అర్చన జరిపారు. ఉత్సవమూర్తులను తులసీ దళాలతో అర్చించి అష్టోత్తరం నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.