ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మళ్లీ పెరిగిన సిమెంటు ధరలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 03, 2022, 10:59 AM

50 కిలోల సిమెంటు బస్తా ధరను రూ. 20-30 మేర పెంచుతూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈనెల 2 నుంచే పెంచిన ధరలు అమల్లోకి వచ్చినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ముడి పదార్థాల అధిక ధరలతో పాటు ఇంధన వ్యయాలు పెరగడమే ఇందుకు కారణమని వివరించాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో బస్తాపై రూ. 20 పెంచగా, తమిళనాడులో రూ. 20-30 మధ్య పెరిగింది. కర్ణాటకలో బ్రాండ్‌, ప్రాంతం ఆధారంగా ధరల పెంపు వేర్వేరుగా ఉందని తెలుస్తోంది. ధర పెరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో సిమెంట్‌ బస్తా ధర రూ. 320-400 మధ్య; తమిళనాడు, కర్ణాటకల్లో రూ. 360-450కు చేరింది.


ధరలు పెంచిన సంస్థలు ఇవే:  అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఇండియా సిమెంట్స్‌, కేసీపీ, ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌, సాగర్‌ సిమెంట్స్‌, దాల్మియా భారత్‌, శ్రీ సిమెంట్‌, రామ్‌కో సిమెంట్స్‌, ఓరియంట్‌ సిమెంట్‌ ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన ఏప్రిల్‌లోనే ధరలు పెంచాలని చూసినా, కొనుగోళ్లు తక్కువగా ఉండటంతో డీలర్లు వ్యతిరేకించారు. దీంతో కంపెనీలు అప్పుడు వెనక్కి తగ్గాయి. గత 3 రోజులుగా సిమెంట్‌ కంపెనీలు డీలర్లకు సరఫరాలు నిలిపి, ఇప్పటికే ఉన్న పాత స్టాక్‌ విక్రయించాల్సిందిగా సూచించాయి. కొత్త ధర ప్రకారం, సరఫరాను గురువారం సాయంత్రం నుంచి ప్రారంభిస్తాయని డీలర్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa