నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి రోజూ నిర్విరామంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 20వ రోజున స్థానిక జాకీర్ హుస్సేన్ నగర్, న్యూ కాలనీ ప్రాంతాలలో విజయవంతంగా జరిగింది. ప్రతి ఇంటికివెళ్ళి ప్రతి కుటుంబాన్ని పలుకరించిన కేతంరెడ్డి వినోద్ రెడ్డి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం దిశగా పోరాడతామని భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ..... ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే అని స్పష్టం చేసారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విషయాన్ని ప్రతి ఇంటిలో కేతంరెడ్డి పంచుకున్నారు. 2014 లో పొత్తులను గౌరవించి పవన్ కళ్యాణ్ గారు తగ్గారని, 2019 లో కూడా తగ్గారని, ఆ సమయంలో తమతో పొత్తులో లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో ఇతర ప్రధాన పార్టీలకు తెలిసొచ్చేలా చేసారని, 2024 లో ఇక ఎవరికీ తలొగ్గే ప్రసక్తే లేదని తెలిపారు. పొత్తుల్లో కలిసొచ్చే ఏ పార్టీ అయినా పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని బలపర్చాల్సిందే అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారికి ఉండేటటువంటి క్లీన్ ఇమేజ్ మరెవ్వరికీ లేదని, రాష్ట్ర ప్రజలందరూ పవనన్నని ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారని, పొత్తుల్లో కలిసొచ్చే ఏ పార్టీ అయినా పవన్ కళ్యాణ్ గారినే ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూపించి ముందుకు సాగాలని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పావుజెన్ని చంద్రశేఖర్ రెడ్డి, కాకు మురళి రెడ్డి, జీవన్, కార్తీక్, హేమంత్ రాయల్, పవన్, సాయి, కుక్కా ప్రభాకర్, జాఫర్, వీరమహిళలు షేక్ ఆలియా, శిరీషారెడ్డి, ఝాన్సీ, సృజన తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa