‘‘గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాల్లో జయభేరి మోగించాం. వచ్చే ఎన్నికల్లో 175 చోట్లా విజయభేరి మోగిద్దాం. ఇదీ మన లక్ష్యం..’ అని ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జ్లకు సీఎం వైఎస్ జగన్ మార్గనిర్దేశం చేశారు. ఈ లక్ష్యాన్ని సాధించడం కష్టం కానే కాదని స్పష్టం చేశారు. ‘అర్హతే ప్రామాణికంగా ప్రతి ఇంటికీ మంచి చేస్తూ చరిత్రలో చెరగని ముద్ర వేశాం. నిత్యం ప్రజలతో మమేకమవుతూ వారి ఆశీస్సులు పొంది చేదోడువాదోడుగా నిలిస్తే 175 స్థానాల్లో విజయభేరి మోగించగలుగుతాం’ అని పేర్కొన్నారు. అందుకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించాలని సూచించారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ‘గడపగడపకు మన ప్రభుత్వం’పై వర్క్షాప్ను సీఎం ప్రారంభించి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నియోజకవర్గాల ఇన్చార్జ్లను ఉద్దేశించి మాట్లాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa