ఇటీవలే ఐటీ కంపెనీల సీఈవోల జీతాలను ఆయా కంపెనీలు బహిర్గతం చేస్తున్నాయి. ఈ సీఈవోలలో దేశీయ అతిపెద్ద ఐటీ దిగ్గజమైన టీసీఎస్ సీఈవో రాజేష్ గోపినాథన్ వార్షిక వేతన ప్యాకేజీ కింద రూ.25.77 కోట్లను పొందారు. ఆయన వేతనం 27 శాతం పెరిగినట్టు కంపెనీ తన వార్షిక రిపోర్టులో తెలిపింది. అలాగే ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ వేతనం 43 శాతం పెరిగి రూ.71 కోట్లుగా ఉన్నట్టు ఆ టెక్ దిగ్గజం పేర్కొంది. విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్జీ మాత్రం 1.82 మిలియన్ డాలర్లను ఇంటికి తీసుకెళ్లారు. గతేడాది ఆయన పొందినది 1.62 మిలియన్ డాలర్లు మాత్రమే. అంటే భారతీయ కరెన్సీ లెక్కల్లో ప్రేమ్జీ పరిహారాలు రూ.12 కోట్ల నుంచి రూ.14 కోట్లకు పెరిగాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో ఆయన ఎటువంటి స్టాక్ ఆప్షన్లను పొందలేదు.
విప్రో సీఐఓ థియరీ డెలాపోర్ట్ వార్షిక వేతనం కింద 2022 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.79.8 కోట్లను(10.51 మిలియన్ డాలర్లను) పొందినట్టు ఈ ఐటీ సర్వీసుల కంపెనీ తన వార్షిక రిపోర్టులో తెలిపింది. ఈ వార్షిక రిపోర్టును విప్రో అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్కు సమర్పించింది. భారత ఐటీ రంగంలో అత్యధికత వేతనం అందుకుంటోన్న సీఈవోగా థియరీ డెలాపోర్ట్ ఉన్నారు.
డెలాపోర్ట్ వార్షిక వేతనం గత 2020-21 ఆర్థిక సంవత్సరంలో 8.7 మిలియన్ డాలర్లుగా అంటే భారతీయ కరెన్సీ లెక్కన రూ.64.3 కోట్లుగా ఉంది. ఈయన కంపెనీలో 2020 జూలైలో చేరడంతో.. ఈ పరిహారాలు కేవలం తొమ్మిది నెలలకు చెందినవే. బెంగళూరుకు చెందిన ఈ ఐటీ కంపెనీ సీఈవోగా డెలాపోర్ట్ వేతనం, అలవెన్స్లలో భాగంగా రూ.13.2 కోట్లను ఇంటికి తీసుకెళ్లగా... కమిషన్లు, వేరియబుల్ పే కింద రూ.19.3 కోట్లను పొందారు. నిబంధనల మేరకు ఇతర ప్రయోజనల కింద రూ.31.8 కోట్లను అందుకున్నారు. మిగిలినవి లాంగ్ టర్మ్ పరిహారాలుగా ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa