ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పిచ్చి పడితే మంచి ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకో: వంశీకి శివభరత్ రెడ్డి సూచన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 13, 2022, 09:56 PM

వంశీకి పిచ్చి పడితే మంచి ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవాలని వైసీపీ నేత శివభరత్ రెడ్డి సూచించారు. వైఎస్సార్‌సీపీ పుట్టినప్పటి నుంచి తాము అదే పార్టీలో ఉన్నామన్నారు. వంశీలా ఊసరవెల్లి లాగా రోజుకో పార్టీ మారలేదని.. ఇంకా రెండేళ్ల సమయం ఉంది, ఈలోపు ఇంకెన్ని పార్టీలు మారతారో తెలియదన్నారు. ఆయన మూడేళ్ల నుంచి భరిస్తుంటే.. తాము 14 ఏళ్ల నుంచి భరిస్తున్నాము అన్నారు. తాము సహనం కోల్పోతే ఆయన పరిస్థితి ఏమవుతుందో ఆలోచించుకోవాలన్నారు.


గన్నవరం వైఎస్సార్‌సీపీ రాజకీయాలు వేడెక్కాయి. వల్లభనేని వంశీ వర్సెస్ దుట్టా రామచంద్రరావు వర్గాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యాఖ్యలకు ఆయన  కౌంటర్ ఇచ్చారు. వంశీతో కలిసి పనిచేసేది లేదని గతంలో చెప్పామని.. ఈ విషయంలో తగ్గేదే లేదని మరోసారి తేల్చారు. తమకు పౌరుషం లేక చేతకాక కాదని, తాను పుట్టింది రాయలసీమలోనే అన్నారు. అధినేత జగన్ మోహన్ రెడ్డిని చూసి ఊరుకుంటున్నాము అన్నారు. వంశీలా రాయలసీమలో పాలేరు పని చేయలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.


తామే మనుషులకు వైద్యం చేస్తాము కాబట్టే సంస్కారంతో ఉన్నామని.. ఆయన పశువులకు వైద్యం చేస్తారు కాబట్టి పశువు లాగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. పశువు కాబట్టి టీడీపీలో ఉండగా విజయమ్మని, జగన్ మోహన్ రెడ్డిని, రాజశేఖర్ రెడ్డిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన విషయాన్ని మర్చిపోలేదన్నారు. ఇప్పుడు వైసీపీలోకి వచ్చి చంద్రబాబుని, వారి సతీమణిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa