టీడీపీని ఇరకాటంలోకి నెట్టే పరిణామం చోటు చేసుకొంది. గత ప్రభుత్వం వ్యక్తుల, పార్టీల సమాచారాన్ని దొంగిలించే ప్రయత్నం చేసిందని హౌస్ కమిటీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. సాధికార సర్వే ద్వారా సమాచారం సేకరించి అప్రజాస్వామిక విధానాలు అవలంభించారని.. దోషులను ప్రజల ముందు నిలబెడతామన్నారు. అప్పట్లో ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లు టాప్ చేశారని.. ఇది శాసన సభ నమ్మింది, కమిటీ కూడా నమ్మింది అన్నారు. ఈరోజు ప్రాథమిక విచారణ మాత్రమే జరిగిందన్నారు. రాబోయే సమావేశాల్లో పూర్తి సమాచారం ఇస్తామన్నారు. విచారణకు అప్పటి అధికారులను కూడా పిలుస్తామన్నారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా దీనిపై ఆరోపణలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పుడు ప్రభుత్వం అధికారికంగా కొనుగోలు చేయకపోవచ్చని.. కానీ అప్పటి ప్రభుత్వంలోని కొందరు వ్యక్తులు అడ్డ దారుల్లో చేశారన్నారు.పెగసస్ మాత్రమే కాదు, ఇతర అన్ని అంశాలపై విచారణ చేస్తామన్నారు. వచ్చే నెల మళ్ళీ జులై 5, 6 తేదీల్లో సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇదిలావుంటే పెగాసస్ వ్యవహారం ఏపీలో మరోసారి తెరపైకి వచ్చింది. గత టీడీపీ ప్రభుత్వంపై ఆరోపణలు రాగా.. అసెంబ్లీ హౌస్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ బుధవారం అసెంబ్లీలో సమావేశమైంది. హౌస్ కమిటీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి అధ్యక్షతన సభ్యులు కరణం ధర్మశ్రీ, భాగ్యలక్ష్మి, మొండితోక జగన్మోహన్రావు, మద్దాళి గిరిధర్ సమావేశమయ్యారు. పెగాసస్ కొనుగోలుకు సంబంధించి అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి హోంశాఖ, ఐటీ శాఖ ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. వీరి నుంచి వివిధ మార్గాల్లో డేటా చోరికి సంబంధించి సమాచారాన్ని సేకరిస్తున్నారు.
గత టీడీపీ హయాంలో చంద్రబాబు ఈ స్పై వేర్ను కొనుగోలు చేశారంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు హాట్టాపిక్ అయ్యాయి. ఏపీ అసెంబ్లీలో ఈ అంశంపై చర్చ జరగ్గా.. ఈ వ్యవహారంపై అసెంబ్లీ హౌస్ కమిటీని నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత స్పీకర్ తమ్మినేని సీతారామ్ హౌస్ కమిటీకి చైర్మన్గా తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డిని నియమించారు. ఎమ్మెల్యేలను సభ్యులుగా నియమించారు. బుధవారం తొలి సమావేశం జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa