చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీ పాలనలో ప్రజల అవసరాల గురించి పట్టించుకోని చంద్రబాబును ప్రజలు ఎప్పుడో ఛీత్కరించారని.. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో కూడా గెలవలేని పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రంలో చంద్రబాబుకు చోటు లేకపోవటంతో సభలు పెట్టి ప్రజలను మళ్లీ మోసం చెయ్యటానికి వస్తున్నారని ఎద్దేవా చేశారు. కానీ సభలన్నీ సక్సెస్ కాలేదన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందన్నారు. ముఖ్యమంత్రి జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజల్లో ఆదరాభిమానాలు దక్కుతున్నాయన్నారు. తమ ప్రభుత్వ పాలనను చూసి తట్టుకోలేక విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు ఖాయమని ధీమాను వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు సంక్షేమం వైపు నిలబడతారన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa