ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంకా వైద్య నిపుణుల పర్యవేక్షణలోనే సోనియా గాంధీ

national |  Suryaa Desk  | Published : Fri, Jun 17, 2022, 04:49 PM

ఇంకా వైద్య నిపుణుల పర్యవేక్షణలోనే కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఉన్నారని సమాచారం. ఈ మేరకు ఆ పార్టీ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. కరోనా అనంతర సమస్యలతో సోనియా ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో ముక్కు నుంచి రక్తం రావడంతో ఈ నెల 12వ తేదీ ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో సోనియా చేరారని ఆలిండియా కాంగ్రెస్ కమిటీ తెలిపింది. వైద్యులు ఆమెకు వెంటనే చికిత్స చేశారని చెప్పింది. గురువారం ఉదయం మరోసారి ఆమెకు పరీక్షలు నిర్వహించారని తెలిపింది. 


ఈ క్రమంలో సోనియా శ్వాసకోశాల్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్టు గుర్తించారని, దానితో పాటు కరోనా తదనంతర సమస్యలకు చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించింది. సోనియా ప్రస్తుతం వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉన్నారని, చికిత్స కొనసాగుతోందని తెలిపింది. ఈ మేరకు ఆలిండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి (సమాచారం) జైరాం రమేశ్ లేఖ విడుదల చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa