ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశంలో యువత వేదనలో ఉంది...సమయంలో వేడుకల్లోదు

national |  Suryaa Desk  | Published : Sun, Jun 19, 2022, 04:25 PM

రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ఆయన పుట్టిన రోజు వేడుకలకు కాంగ్రెస్ దూరంగా ఉంది.  అగ్నిపథ్ పథకంపై దేశ వ్యాప్తంగా  నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో తన పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి వేడుకలు నిర్వహించవద్దని రాహుల్ గాంధీ తమ పార్టీ నాయకులు, కార్యకర్తలకు సందేశం పంపించారు. అగ్నిపథ్ పై  దేశంలోని యువకులు ఎంతో  వేదనకు గురవుతున్నారని, వీధుల్లో నిరసనలు చేస్తున్న వారికి  కార్యకర్తలు అండగా నిలవాలని సూచించారు. 


కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ  52వ పడిలోకి అడుగు పెట్టారు. ఆదివారం ఆయన పుట్టిన రోజు. సాధారణంగా  రాహుల్ గాంధీ పుట్టిన రోజు అంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల హడావుడి ఉంటుంది. కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహిస్తుంటారు. కానీ, ఈ రోజు మాత్రం కాంగ్రెస్ శ్రేణులు రాహుల్ పుట్టిన రోజు వేడుకలను నిర్వహించడం లేదు. దీనికి ఓ కారణం ఉంది.


‘దేశంలో యువత వేదనలో ఉంది. ఈ సమయంలో మనం వారికి, వారి కుటుంబాలకు అండగా ఉండాలి. నా పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి వేడుకలు నిర్వహించవద్దని దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు, నా శ్రేయోభిలాషులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దేశంలో ప్రస్తుత పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. మనం యువత, వారి కుటుంబాల బాధలను పంచుకోవాలి. వారికి అండగా నిలబడాలి’ అని రాహుల్ పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa