ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వికటించిన దంతవైద్యం...కోలుకొన్నాక న్యాయ పోరాటం చేస్తానన్న నటీ

national |  Suryaa Desk  | Published : Sun, Jun 19, 2022, 11:38 PM

పంటి వైద్యం కోసం వెళ్తే ముఖమే వాచేలా చేసింది ఓ ఆసుపత్రి. దీంతో బాధితులరాలైన ఆ హీరోయిన్ న్యాయ పోటానికి సిద్దమవుతోంది. కన్నడ నటి స్వాతి సతీష్ కు దంత వైద్యం వికటించగా, ఆమె ముఖం ఉబ్బిపోయి గుర్తుపట్టలేని విధంగా తయారైంది. బెంగళూరులోని ఆ డెంటల్ క్లినిక్ లో తనకు తప్పుడు వైద్యం చేశారని స్వాతి ఆరోపిస్తోంది. ట్రీట్ మెంట్ సమయంలో అనస్తీషియా ఇచ్చేటప్పుడు వేరే మందు (సాల్సిలిక్ యాసిడ్) ఇచ్చి ఉంటారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం స్వాతి మరో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కోలుకున్నాక సదరు డెంటల్ క్లినిక్ పై న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.  పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన స్వాతి సతీష్ ఇటీవల రూట్ కెనాల్ ట్రీట్ మెంట్ చేయించుకునేందుకు ఓ డెంటల్ క్లినిక్ కు వెళ్లింది. అయితే, రూట్ కెనాల్ చికిత్స అనంతరం ఆమె ముఖం భయంకరంగా తయారైంది. ముఖం అంతా వాచిపోవడంతో గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. మరోవైపు తీవ్రమైన నొప్పి కూడా కలగడంతో ఆ యువ హీరోయిన్ బాధ వర్ణనాతీతం. అందవికారంగా తయారవడంతో కొన్ని సినిమా చాన్సులు కూడా వెనక్కి వెళ్లిపోయాయి. స్వాతి సతీష్ కన్నడలో 6 టు 6, ఎఫ్ఐఆర్ తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa