ఈడీ ముందు సోనియాగాంధీ హాజరవుతారు లేక మరింత సమయం అడుగుతారా అన్న చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది. "కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సోమవారం సాయంత్రం సర్ గంగారామ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు" అని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ తెలిపారు. ఈ నేపథయంలో ఆమె ఈ నెెల 23న ఈడీ విచారణకు హాజరవుతారా లేక మరింత గడువు కోరుతారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇదిలావుంటే కోవిడ్ ఇన్ఫెక్షన్ కారణంగా ముక్కు నుంచి రక్తస్రావం కావడంతో గాంధీ ఆస్పత్రిలో చేరారని, తర్వాత పోస్ట్ కోవిడ్ సమస్య కారణంగా శ్వాసకోశంలో ఫంగల్ ఇన్ఫెక్షన్తో ఇబ్బంది పడుతున్నారని జైరాం రమేష్ గతంలో చెప్పారు. ఆ మేరకు డాక్టర్లు చికిత్స చేస్తున్నారని ఆయన ట్వీట్ ద్వారా వెల్లడించారు.
ఇదిలావుంటే సోనియాగాంధీ మనీలాండరింగ్ కేసులో జూన్ 8వ తేదీన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరు కావాల్సి ఉంది. అయితే ఆమె కోవిడ్ వైరస్ సోకడంతో దర్యాప్తు ఏజెన్సీ నుంచి కొంత సమయం కోరారు. ఆ మేరకు జూన్ 23న తన ముందు హాజరుకావాలని ఏజెన్సీ ఆమెకు తాజాగా సమన్లు జారీ చేసింది. ఇదే కేసులో రాహుల్ గాంధీ సోమవారం కూడా ఈడీ ముందు హాజరయ్యారు. జూన్ 13 నుంచి 15వ తేదీన మూడు రోజుల పాటు ఆయన్ని ఈడీ ప్రశ్నించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa