చైనాలోని ఓ చరిత్రత్మాక గుర్తు చెరిగిపోయింది. వీఐపీలకు అతిధ్యమిచ్చిన ఆ రెస్టారెంట్ ఇక లేదనే చెప్పాలి. చైనాలో చరిత్రత్మాకమైన అతిపెద్ద రెస్టారెంట్ మునిగిపోయింది. హాంకాంగ్లోని 50 ఏళ్లుగా ఐకానిక్ మైలు రాయిగా నిలిచిన ఫ్లోటింగ్ రెస్టారెంట్ దక్షిణ చైనా సముద్రంలో మునిగిపోయింది. దీంతో దాని మాతృ సంస్థ అబెర్డీన్ రెస్టారెంట్ ఎంటర్ప్రైజెస్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ ఘటనలో సిబ్బంది ఎవరూ గాయపడలేదని వెల్లడించింది. ప్రతికూల పరిస్థితులు కారణంగా ఓడ మునిగిపోయిందని రెస్టారెంట్ యజమానులు తెలియజేశారు.
అయితే ఈ రెస్టారెంట్కు చాలా చరిత్ర ఉంది. పెద్ద పెద్ద స్థాయిల్లో ఉన్నవాళ్లు ఇందులో ఆతిథ్యం పొందారు. క్వీన్ ఎలిజబెత్-II, హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్, బ్రిటీష్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్లతో సహా మూడు బిలియన్లకుపైగా అతిథులు ఇందులో వంటకాలను రుచి చేశారు. ఈ రెస్టారెంట్కు ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. జేమ్స్బాండ్ సినిమాతో సహా పలు సినిమాల్లో కనిపించింది. బ్రూస్ లీ నటించిన ఎంటర్ ది డ్రాగన్, జేమ్స్ బాండ్: ది మ్యాన్ విత్ ది గోల్డెన్ గన్తో సహా అనేక హాంకాంగ్, అంతర్జాతీయ చలనచిత్రాల్లో కనిపించింది.
ఇదిలావుంటే దక్షిణ చైనా సముద్రంలోని పారాసెల్ దీవులను దాటుతున్న సమయంలో నౌకలోకి నీరు ప్రవేశించడం ప్రారంభమైందని కంపెనీ తెలియజేసింది. "ఓడను రక్షించడానికి టోయింగ్ కంపెనీ ప్రయత్నాలు చేసినప్పటికీ, దురదృష్టవశాత్తు ఆదివారం అది బోల్తా పడింది" అని కంపెనీ తెలిపింది. ఇదిలావుంటే కరోనా వైరస్ ప్రభావం ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్పై కూడా పడింది. కోవిడ్ కారణంగా 2020 నుంచి దీనిని క్లోజ్ చేయాల్సి వచ్చింది. దాంతో ఈ రెస్టారెంట్ నష్టాలను చవిచూసింది. తర్వాత రెస్టారెంట్ వాటా దారులకు ఇది ఆర్థిక భారంగా మారింది. అయితే 2013 నుంచి వ్యాపారం లాభదాయకంగా లేదని, పెద్ద మొత్తంలో నష్టాలను చవిచూస్తోందని ఆపరేటర్ మెల్కో ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ కూడా గత నెలలో వెల్లడించింది.
చాలా కళాత్మకంగా అలంకరించడంతో ఈ నౌకా రెస్టారెంట్ అందరిని ఆకర్షించేది. చాలా విలాసవంతంగా నియాన్ లైట్లు, మెట్ల దారిలో ప్రత్యేకంగా రూపొందించిన భారీ పెయింటింగ్లు ఉండేవి. బంగారు సింహాసనం కూడా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa