ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోప్ ను కలవడం ఎంతో సంతోషం కలిగిస్తోంది: నవీన్ పట్నాయక్

international |  Suryaa Desk  | Published : Wed, Jun 22, 2022, 11:46 PM

పరమ పవిత్రుడైన పోప్ ను కలవడం ఎంతో సంతోషం కలిగిస్తోందని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తెలిపారు. నవీన్ పట్నాయక్ ఉన్నతస్థాయి బృందంతో కలిసి ఇటలీ పర్యటనకు వెళ్లారు. అంతకుముందు, నవీన్ పట్నాయక్ రోమ్ లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతిపిత ఆశయాలు, సిద్ధాంతాలే తనకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. రోమ్ లో ప్రపంచ ఆహార కార్యక్రమం ప్రధాన కార్యాలయాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ఆయన వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ ను కలిశారు. పరమ పవిత్రుడైన పోప్ ను కలవడం ఎంతో సంతోషం కలిగిస్తోందని నవీన్ పట్నాయక్ తెలిపారు. సాదర స్వాగతం పలికినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని వెల్లడించారు. పోప్ కు ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. ఇదిలావుంటే రోమ్ నుంచి తిరిగివచ్చే క్రమంలో సీఎం నవీన్ పట్నాయక్ దుబాయ్ లో మధ్యప్రాచ్యం వ్యాపారవేత్తలతోనూ, స్థానిక పెట్టుబడిదారులతోనూ సమావేశం కానున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa