కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టాలని అంతకు ముందు డిమాండ్ చేసిన చంద్రబాబు, పవన్కళ్యాణ్.. ఆ తర్వాత అమలాపురంలో జరిగిన హింసను, దాడులను ఇప్పటి వరకు ఖండించలేదు. దీన్ని బట్టి వాటి వెనక ఎవరున్నారనేది అందరూ అర్ధం చేసుకుంటున్నారు. జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టాలన్న మీరు, ఆ తర్వాత ఎందుకు సమర్థించలేదు?. ఎందుకు వెనక్కు పోయారు? వీటికి సమాధానం చెప్పాలి. ఇలాంటి నీచ రాజకీయాలను ప్రజలు క్షమించరని శనివారం తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో డొక్కా మాణిక్య వరప్రసాద్ మీడియాతో మాట్లాడారు. చివరకు నిన్న మంత్రివర్గంలో కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెడుతూ నిర్ణయం తీసుకున్నా, ఇప్పటి వరకు చంద్రబాబు, పవన్కళ్యాణ్ స్పందించలేదు. అలా అనైతికంగా వ్యవహరిస్తున్న వారు రాజకీయాల నుంచి వైదొలగాలి. ఇంకా ఆ పార్టీల గుర్తింపు రద్దు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాం. కోనసీమకు అంబేడ్కర్ పేరును వారు సమర్థించడం లేదంటే, వారి విలువలేని రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు. అందుకే ఆ పార్టీల గుర్తింపు రద్దు చేయాలని కోరుతున్నాం. దీనిపై ఎన్నికల సంఘం కూడా స్పందించాలి అని ఆయన మాట్లాడారు. ఐతే ఇతను టీడీపీ నుండి వైసీపీ లోకి వచ్చిన వ్యక్తి కావడం గమనార్హం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa