జగనన్న ఏం చేశాడు అని ఆరోపించే టీడీపీ నేతలారా..మీ ఇంట్లో అడిగి తెలుసుకోండి అని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి సూచించారు. జనం కోసం పరితపించే నాయకుడు జగన్ ఒక్కరేనని.. ఆయనకు ఎవరూ సాటి రారని మరో 30 సంవత్సరాల పాటు వైయస్ జగనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారంటూ వ్యాఖ్యానించారు. వైయస్ జగన్ సంక్షేమ పథకాలు, ఆయన పాలన నేడు దేశానికే డిక్సుచిలా మారాయన్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా లెక్కచేయకుండా పేదల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను ప్రకటించి వాటిని చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారన్నారు. ఈ మూడేళ్ళలో లక్షా 71 వేల కోట్ల రూపాయలను నేరుగా ప్రజల ఖాతాల్లో జమ చేసాడని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa