నిష్పాక్షితకు నిదర్శనం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని శ్రీకూర్మంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ... "మూడేళ్ల తరువాత మీ ముందుకు వచ్చాను.పథకాల అందుతున్నాయా లేదా అన్నవి తెలుసుకునేందుకే ఇక్కడికి వచ్చాను. పథకాల అమలుకు సంబంధించి మీరు ఎవ్వరికైనా లంచం ఇచ్చారా ..లేదా మీరు ఫలానా పార్టీకి ఓటు వేయాలని కండీషన్ పెట్టారా అన్నవి కూడా మిమ్మల్ని ప్రశ్నించాను. నిష్పక్షపాతంగా పథకాలు అందుతున్నాయి..అన్నది నిర్వివాదాంశం. అందుకే ఈ ప్రభుత్వం ప్రజలకు చేరువ అయ్యేందుకు పథకాల అమలు అందేలా కృషి చేస్తున్నాం. ఈ ప్రభుత్వం పోతే ఏమౌతుంది.. వీటి గురించి ఆలోచించాలి. మీరు ఓటేసి ఎంచుకున్న ప్రభుత్వం బట్టే ఇవన్నీ ఆధారపడి ఉంటాయి." "విజ్ఞులైన వారంతా పథకాలకు సంబంధించి, ప్రభుత్వ పనితీరుకు సంబంధించి వివరించేందుకు ప్రయత్నించాలి. కనుక తెలిసిన వారు తెలియని వారికి తెలియజెప్పే ప్రయత్నం ఒకటి తప్పక చేయాలి. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అయింది..చాలా మంది చదువులేదు.. మంచి ఇల్లు లేదు.. మా బతుకులు ఇంతే అని ఆగిపోతే అది సబబేనా .. ఆ విధంగా నిరుత్సాహ పడిపోతే మంచిదేనా.. అందుకే అలాంటి ఆలోచనలను మార్చేందుకు , జీవన ప్రమాణాలు పెంచేందుకు, భరోసాతో జీవించేందుకు ఇన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. 30 లక్షల ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసి గత ఏడాది పంచివ్వడం జరిగింది. "
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa