ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై నమోదైన కేసు ప్రస్తుతం ఏ స్థితిలోవుందని ఏపీ ప్రభుత్వాన్ని రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించింది. ఏపీ కేడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై నమోదైన ఏసీబీ కేసు వ్యవహారంపై మంగళవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. తనపై నమోదైన ఏసీబీ కేసును కొట్టివేయాలంటూ ఏబీవీ ఇటీవలే హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్పై మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు.. అసలు ఈ కేసు తాజా పరిస్థితి ఏమిటో చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తనపై నిబంధనలకు విరుద్ధంగా ఏసీబీ కేసు నమోదు చేశారని ఏబీవీ తన పిటిషన్లో ఆరోపించారు. అంతేకాకుండా కేసు నమోదు చేసి ఇప్పటికే ఏడాది దాటి 3 నెలలు అవుతున్నా...కోర్టులో చార్జిషీటే దాఖలు చేయలేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ వాదనలతో స్పందించిన హైకోర్టు కేసు తాజా పరిస్థితిని తెలియజేయాలని ప్రభుత్వాన్ని కోరింది. ఇందుకోసం 4 వారాల గడువు కావాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోరగా.. అందుకు తిరస్కరించిన కోర్టు 2 వారాల గడువు ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈ పిటిషన్పై తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa