విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీమతి ఎం.దీపిక, ఐపీఎస్ ఆదేశాలతో విజయనగరం రూరల్ సిఐ శ్రీమతి టి.ఎస్.మంగవేణి ఆధ్వర్యంలో SEB మరియు గుర్ల పోలీసులు సంయుక్తంగా దేవుని కనపాక గ్రామ శివార్లలో రైడ్స్ నిర్వహించినట్లు పోలీస్ శాఖ తెలియజేసింది. ఇందులో భాగంగా 1100 లీటర్ల బెల్లం ఊటను, 35 లీటర్ల నాటుసారా ను గుర్తించి, ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... జిల్లాలో ఎక్కడ అవాంఛనీయమైన ఘటనలు జరిగిన తగిన శిక్షలకి గురవుతారు. కాబట్టి జీవితాలు నాశనం చేసుకొనే దారిలో కాకుండా న్యాయమైన దారిలో బ్రతకటానికి ప్రయత్నించండి అని ప్రజలని హెచ్చరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తాం అని తెలియజేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa