కజకిస్తాన్లో ఎంబీబీఎస్ చదువుతున్న కర్నూలు యువకుడు ప్రమాదవశాత్తు మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్లితే. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం పొట్లపాడుకు చెందిన పి. ప్రసాద్, మేరీ కుమారి దంపతుల కుమారుడైన పి. వినయ్కుమార్(23) కజకిస్తాన్లోని ఆల్మమట్టి నగరంలోని కజక్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చేస్తున్నాడు.
ఈ క్రమంలో భారత కాలమానం ప్రకారం గురువారం స్నేహితులతో కలసి సమీపంలో ఉన్న కుంటలో ఈతకు వెళ్లాడు. అయితే నీటిలోకి దూకే సమయంలో అదుపు తప్పి రాయికి తలకొట్టుకోవడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఈ విషయాన్ని మొదట స్నేహితులు వినయ్కుమార్ తల్లిదండ్రులకు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa