ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాను అసెంబ్లీ స్పీకర్ అయినా మొదట వైసీపీ కార్యకర్తనే: తమ్మినేని సీతారాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 09, 2022, 05:26 PM

తాను అసెంబ్లీ స్పీకర్ ని అయినా, మొదట వైసీపీ కార్యకర్తనని స్పీకర్ తమ్మినేని సీతారం స్పష్టం చేశారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం వైసీపీ ప్లీనరీలో పాల్గొన్నారు. పాలనా వికేంద్రీకరణ-పారదర్శకత అంశంపై తీర్మానం ప్రవేశపెట్టగా, మొదట తమ్మినేని సీతారాం ప్రసంగించారు. తాను పార్టీ కార్యక్రమాలకు హాజరైతే తప్పుబట్టడం మానుకోవాలని హితవు పలికారు.  ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత స్పీకర్ గా విధులు నిర్వర్తించాలని సీఎం జగన్ ఆదేశిస్తే బాధ్యతలు చేపట్టానని వివరణ ఇచ్చారు. గతంలో స్పీకర్ గా ఉన్న సమయంలో కోడెల శివప్రసాదరావు టీడీపీ ప్లీనరీలో పాల్గొనలేదా? అని తమ్మినేని ప్రశ్నించారు. పార్టీ కార్యక్రమాలకు తప్పకుండా హాజరవుతానని ఉద్ఘాటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa