అప్రమత్తతో హిమాచల్ ప్రదేశ్ లోనిి సిమ్లాజిల్లాలో పెను ప్రమాదం తప్పింది. అంతేకాదు భారీఎత్తున్న ప్రాణ నష్టం జరగలేదు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకొన్నారు. వివరాలలోకి వెళ్లితే..హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా జిల్లాలో నాలుగు అంతస్థుల భవనం కుప్పకూలింది. శనివారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో ఇది జరిగింది. ఈ విషయాన్ని రాష్ట్ర విపత్తు నిర్వహణ సీనియర్ అధికారి వెల్లడించారు. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా బిల్డింగ్ కూలినట్టు తెలుస్తుంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. భవనం కూలిపోకముందే ఖాళీ చేశారు. దాంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ భవనంలో యూకో బ్యాంక్ ఒక శాఖ, ఒక దాబా, ఒక బార్, కొన్ని ఇతర వ్యాపార సంస్థలు భవనంలో ఉన్నాయి.
అయితే సెలవు కావడంతో బ్యాంక్లో ఎవరూ లేరు. కానీ బార్లో చాలామంది ఉండగా.. ప్రమాదం జరిగే సంకేతాలు గుర్తించి వారంతా బయటకు వచ్చేశారు. సెలవు దినం కావడంతో సంఘటన జరిగిన సమయంలో బ్యాంక్లో ఎవరూ లేరని యూకో బ్యాంక్ జోనల్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ రమేష్ దద్వాల్ తెలిపారు. "గ్రౌండ్ ఫ్లోర్లోని బార్లో కూర్చున్న కొంతమంది కిటికీ అద్దాలు అకస్మాత్తుగా పగుళ్లు రావడం గమనించారు. ప్రమాదాన్ని గ్రహించి వారు వెంటనే బయటకు పరుగుల తీశారు." అని అక్కడ పనిచేస్తున్న సిబ్బందిలో ఒకరు చెప్పినట్టు రమేష్ దద్వాల్ తెలియజేశారు.
భవనం కూలిపోయిన సంఘటనకు సంబంధించిన వీడియోను ఏఎన్ఐ తన ట్విట్టర్లో షేర్ చేసింది. అందులో భవనం పేక మేడలా కూలిపోయిన దృశ్యం చూడొచ్చు. ఇదిలాఉండగా హిమాచల్ ప్రదేశ్లో శనివారం నుంచి జూలై 13 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. జూలై 6న హిమాచల్ ప్రదేశ్లో కులులోని మణికరణ్లో వరదల కారణంగా ఒకరు మరణించారు. మరో నలుగురు గల్లంతయ్యారు. కులులోని బాబెలి వద్ద బియాస్ నదిలో కారు పడిపోవడంతో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa