ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పర్యాటక కేంద్రంగా శ్రీలంక మాజీ అధ్యక్షుడి నివాసం

international |  Suryaa Desk  | Published : Mon, Jul 11, 2022, 08:48 PM

శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స నివాసం ఓ పర్యాటక స్థలంలా మారింది. పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ భవనం చూసేందుకు పోటెత్తుతున్నారు. చాలామంది కుటుంబ సమేతంగా వస్తుండడం విశేషం. అంతేకాదు, గొటబాయ భోజనం చేయడానికి ఉపయోగించే పెద్ద డైనింగ్ హాలులో బల్లపై వారు భోజన కార్యక్రమాలు చేపడుతున్నారు.


ఇదిలావుంటే ప్రజాగ్రహానికి భయపడి తన ఇంటి నుంచి పారిపోయిన గొటబాయ రాజపక్స అధ్యక్ష పదవికి రాజీనామా చేయగా, అదే బాటలో ప్రధాని రణిల్ విక్రమసింఘే కూడా నడిచారు. తాజాగా, పార్లమెంటు స్పీకర్ మహీంద యాపా అభేవర్ధనే నేతృత్వంలో అఖిలపక్ష ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. కాగా, నిన్న వేలమంది నిరసనకారులు కొలంబో వీధుల్లో కదం తొక్కారు. గొటబాయ రాజపక్స నివాసాన్ని ముట్టడించారు. గొటబాయ అప్పటికే పారిపోగా, ఆందోళనకారులు ఆయన నివాస భవనాన్ని ఆక్రమించారు. అందులోని స్విమ్మింగ్ పూల్ లో జలకాలాడడమే కాదు, అక్కడున్న గదుల్లో హాయిగా విశ్రమించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa