ఏపీకి ప్రత్యేక హోదాపై గళమెత్తి కేంద్రం నుంచి సాధించుకొనేందుకు వైసీపీకి ఇదే మంచి అవకాశమని మాజీ ఐపీఎస్ అధికారి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఇతర పార్టీల మద్దతు బీజేపీకి అవసరమని ఆయన అన్నారు. ఇదే క్రమంలో వైసీపీ అవసరం కూడా బీజేపీకి చాలా అవసరమని చెప్పారు. బీజేపీ అవసరం నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదాను వైసీపీ డిమాండ్ చేసే అవకాశం ఉందని అన్నారు. ఈ అవకాశాన్ని వైసీపీ ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రత్యేక హోదాను సాధించడం కోసం పార్టీలకు అతీతంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని లక్ష్మీనారాయణ చెప్పారు. ముందస్తు ఎన్నికల వల్ల రాష్ట్రానికి ఒరిగే ప్రయోజనం ఏమీ లేదని అన్నారు. ప్రభుత్వాలు తెస్తున్న అప్పులు, చేస్తున్న అభివృద్ధిపై లెక్కలు చెప్పాలని సమాచార హక్కు చట్టం కింద కోరతామని తెలిపారు. యువతకు ఉద్యోగాలను కల్పించడంపై అన్ని పార్టీలు దృష్టి సారించాలని అన్నారు. దేశంలో పెరిగిపోతున్న ద్రవ్యోల్బణంపై చర్చ జరగాలని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa