ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నం జిల్లాలో శుక్రవారం పర్యటించనున్నారు. ఈ నెల 15న అనగా ఈ రోజు విశాఖలో వైయస్ఆర్ వాహన మిత్ర లబ్ధిదారులకు ఆర్ధిక సాయం అందించే కార్యక్రమంలో సీఎం వైయస్ జగన్ పాల్గొననున్నారు. ఉదయం 9.20 గంటలకు తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ బయలుదేరతారు సీఎం వైయస్ జగన్. 10.30 గంటలకు విశాఖ చేరుకుంటారు. 11.05 గంటలకు ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్కు చేరుకుని వైయస్సార్ వాహన మిత్ర లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమం వుంటుంది. అనంతరం బహిరంగ సభను ఉద్దేశించి సీఎం వైయస్ జగన్ ప్రసంగించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa