మధురవాడ చంద్రంపాలెం జాతర గట్టు మీద కొలువైవున్న శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో ఈరోజు శుభకృత్ నామ సంవత్సరం గ్రీష్మ ఋతువు ఆషాడ మాసం కృష్ణ పక్షం తిథి విదియ శుక్రవారం అమ్మవారికి నిత్యార్చనతో పూజలు ప్రారంభించి, ప్రత్యేక కుంకుమార్చన, పుష్పార్చన, మొదలగు పూజ కార్యక్రమాలు ఆలయ ప్రధాన అర్చకులు, పట్నాల సుబ్బారావు శర్మ, , పట్నాల హరి ప్రసాద్ శర్మ, హరి చరణ్, హరి స్వామి తదితరులు జరిపించడం జరిగింది. మరియు సాయంత్రం అమ్మవారికి పంచామృత సుగంధ జలాభిషేకం జరిపించి, ప్రత్యేకంగా అలంకరించడం జరిగింది, చంద్రంపాలెం వాస్తవ్యులు పిళ్లా తమ్మునాయుడు దంపతులు ఆర్ధిక సహాయంతో సమకూర్చిన పులిహోర ప్రసాదమును భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు పంపిణీ చేయడం జరిగింది, అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మొక్కులు తీర్చుకున్నారు, ఈ కార్యక్రమంలో ఆలయ ఆలయ కమిటీ అధ్యక్షులు పిళ్లా సూరిబాబు, సెక్రటరీ నాగోతి తాతారావు, కోశాధికారి పిళ్లా శ్రీనివాసరావు, సభ్యులు పిళ్లా వెంకటరమణ , గూడేల రాజు, కేశనకుర్తి అప్పారావు, నాగోతి అప్పలరాజు, పిళ్లా మోహన్ శివ కృష్ణ , ముఖ్య సభ్యులు పిళ్లా అప్పన్న, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa