రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు సంక్షేమం అందజేయడం రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అజెండా అని ఇచ్చాపురం నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్ అన్నారు. సోంపేట మండలం పాలవలసలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి పథకాల అమలుపై ఆరా తీశారు. సీసీ రహదారి నిర్మించాలని, ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని స్థానికులు విన్నవించారు.
అనంతరం సాయిరాజ్ మాట్లాడుతూ సీఎం జగన్ ఇప్పటికే 95 శాతం హామీలు అమలు చేసి సరికొత్త చరిత్ర సృష్టించారన్నారు. అన్ని వర్గాలకు అండగా నిలుస్తూ ఇటు సంక్షేమం, అటు అభివృద్ధిలో కొత్త ఒరవడి సృష్టిస్తున్నాడని చెప్పారు. కార్యక్రమంలో సోంపేట ఎంపీపీ నిమ్మన దాస్, పీఏసీఎస్ అధ్యక్షుడు రౌతు విశ్వనాథం, సర్పంచ్ మర్ల హేమలత, ఎంపీటీసీ రూపావతి, పార్టీ నాయకులు బుద్ధాన శ్రీకృష్ణ, కోట్నీ శ్రీనివాసరావు, మర్ల కంకరరావు, డి. డిల్లీరావు, పైల కామోజి, అన్నెపు నారాయణ, గున్న కొంబురు, మర్ల వెంకటరావు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa