గనుల శాఖ అనుసరిస్తున్న పారదర్శక విధానాలకు జాతీయ స్ధాయిలో ప్రశంసలు, గుర్తింపు దక్కాయి. ఈ నేపథ్యంలో ఏపీ గనుల శాఖ మంత్రి, సంబంధిత అధికారులపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ప్రధాన ఖనిజాల అన్వేషణ, వేలం, మైనింగ్ కార్యకలాపాల పర్యవేక్షణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ పాటిస్తున్న అత్యుత్తమ విధానాలను ప్రశంసిస్తూ కేంద్ర బొగ్గు, గనుల శాఖ నుంచి ‘ఖనిజ వికాస్’ అవార్డు దక్కింది. ఇటీవల ఢిల్లీలో మైన్స్ అండ్ మినరల్స్పై జరిగిన సదస్సులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, గనుల శాఖ డైరెక్టర్ వీజీ.వెంకటరెడ్డిలు అవార్డు అందుకున్నారు. ఖనిజ వికాస్ అవార్డు క్రింద కేంద్ర గనుల శాఖ అందజేసిన రూ. 2.40 కోట్ల ప్రోత్సాహక చెక్ను తాజాగా సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్ జగన్కు గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ద్వివేది, డెరెక్టర్ వీజీ.వెంకటరెడ్డిలు చూపించారు. ఈ క్రమంలో సీఎం వైయస్ జగన్ గనుల శాఖను అభినందిస్తూ.. ఇలాగే ముందుకెళ్లాలని ఆకాంక్షించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa