త్వరలో విశాఖ దశ మారనున్నదని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ వెల్లడించారు. విశాఖ, విజయవాడ, తిరుపతికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని ఆయన తెలిపారు. ఇన్ఫోసిస్ తరహా పెద్ద కంపెనీలు విశాఖకు రాబోతున్నాయని చెప్పారు. ప్రజలకు సేవ చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ప్రచారం కోసమే పాకులాడతారని విమర్శించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆరుగురు మంత్రులు, ఎస్పీలు, అధికారులు, వాలంటీర్లు ఉన్నారని చెప్పారు. వరద బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 2 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామని తెలిపారు. వరద బాధిత ప్రాంతాల్లో మంత్రులు పర్యటించడం లేదంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa