ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిత్తశుద్ధి లేని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 23, 2022, 01:00 PM

ముస్లిం మైనార్టీల సంక్షేమం పై రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు అని పల్నాడు జిల్లా, నరసరావుపేట టీడీపీ ఇంచార్జి చదలవాడ అరవింద్ బాబు ఆరోపించారు. నరసరావుపేట పట్టణంలో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన ముస్లిం మైనారిటీల సమావేశంలో  మాట్లాడుతూ, మైనార్టీల సంక్షేమం కోసం కార్పొరేషన్‌ ఏర్పాటు చేసిన ఘనత టీడీపీదే. చంద్రబాబు హయాంలో మైనార్టీల సంక్షేమం కోసం వివిధ పథకాలు ప్రవేశ పెట్టారు. సీఎం జగన్‌ ఏకంగా దుల్హన్‌ పథకాన్ని రద్దు చేయడం.ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ కార్పొరేషన్‌లో నిధులను ఖాళీ చేసిన ఘనత వైసీపీకే దక్కుతుంది. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు,ఎప్పుడు ఎన్నికలు వచ్చిన వైసీపీకి పతనం తప్పదు.స్థానిక వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గత ఎన్నికల్లో గెలిచిన వెంటనే నియోజకవర్గంలోని మసీదులకు మరమ్మతులు చేపడతానని చెప్పి నమ్మకద్రోహం చేశారు అని తెలియజేసారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa