ఖరీఫ్ లో రైతులకు అవసరమైన ఎరువులు , విత్తనాలు ఆర్ . బి . కె . లలో అందుబాటులో ఉంచాలని కృష్ణా జిల్లా కలెక్టర్ పి . రంజిత్ బాషాగారు వ్యవసాయ అధికారులను ఆదేశించారు . ఎరువులు , విత్తనాలు అందలేదని రైతుల నుండి ఫిర్యాదులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు . జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన శుక్రవారం కలెక్టరేట్ లోని స్పందన సమావేశపు హాల్ లో జరిగింది . అనంతరం వరి పైరులో పురుగులు మరియు తెగుళ్ళ నివారణ పద్ధతుల గురించి రైతుల్లో అవగాహన కల్పించేందుకు పోస్టర్లు మరియు కరపత్రాన్ని విడుదల చేశారు .
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa