ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన డా. రవి రామ్ కిరణ్ గోరంట్ల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 23, 2022, 12:59 PM

రాజమండ్రి గ్రామీణ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశాల మేరకు నేడు డా.రవి రామ్ కిరణ్ గోరంట్ల వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో స్థానిక నేతలతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా రవి రామ్ కిరణ్ గోరంట్ల మాట్లాడుతూ మన శాసనసభ్యులు అమెరికా పర్యటనలో ఉన్న నిత్యం మీకోసమే ఆలోచిస్తారని ఎప్పటికప్పుడు ప్రజలు పడుతున్న ఇబ్బందులను  తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ అకాల వర్షాల వల్ల ప్రజలుకు పనులు లేక తిండి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని  ఆయన తెలియజేసారు. ఈ సందర్భంగా రవి రామ్ కిరణ్ గోరంట్ల ఈ అకాల వర్షాలు వల్ల నష్టపోయిన దాదాపు 60 కి పైగా కుటుంబాలకు ఒక వారం సరిపడా నిత్యవసర సరుకులు బియ్యం మరియు కూరగాయలు పంపిణీ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa