తనకు లభించిన ఈ ఈ పునర్జన్మను ప్రజాసేవకే అంకితమని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ ప్రకటించారు. విజయవాడ కనకదుర్గమ్మను ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దుర్గామాత దయతోనే తాను పడవ ప్రమాదం నుంచి బయటపడినట్టు చెప్పారు. కోనసీమ జిల్లాల్లోని వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్తూ సోంపల్లి రేవు వద్ద జరిగిన పడవ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన నిన్న విజయవాడ దుర్గగుడి, గొల్లపూడి దర్గాలో, మైలవరం, నూజివీడు విఘ్నేశ్వరస్వామి ఆలయంలో, బాప్టిస్టు చర్చిలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తనకు లభించిన ఈ పునర్జన్మను ప్రజాసేవకే అంకితం చేస్తానని ఉమ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa