జగన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షాల, పేద ప్రజల ఆస్తులు కూల్చడమే పనిగా పెట్టుకుందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వా కార్యదర్శి హరి ప్రసాద్ అన్నారు. మంగళవారం సంధ్య సర్కిల్లోని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డికి చెందిన కట్టడాన్ని కూల్చివేయడంపై ఆయన ఆగ్రహ వ్యక్తం చేశారు. ఎటు వంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా విచారించకుండా ఆస్తులను కూల్చడం సరైన పద్ధతి కాదన్నారు. ఆయన స్థలాన్ని ఎక్కడ కబ్జా చేయలేదని తన స్థలాన్ని గుడి కోసం వదిలిపెట్టారన్నారు.
నగరంలో అధికారులు ప్రతిపక్షాల, పేదల ఇల్లు నిర్ధాక్షణంగా వాస్తవాలు తెలుసుకోకుండా కూలుస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదన్నారు. ప్రజలు పాలించమని అధికారం ఇస్తే ఈ కుల్చడాలు ఏమిటన్నారు. నగరంలో వైసిపి నాయకులు కబ్జాలు చేసిన వాటిని పట్టించుకోని అధికారులు ప్రజలపై ప్రతిపక్షాల ఆస్తులపై ఒంటి కాలు మీద వస్తున్నారని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa