కరోనా కారణంగా టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ వెస్టిండీస్ పర్యటనకు పూర్తిగా దూరమయ్యాడు. ఇటీవల హెర్నియా ఆపరేషన్ చేయించుకున్న రాహుల్ వెస్టిండీస్తో జరిగే టీ20 సిరీస్కు ఎంపికయ్యాడు. ఈ పర్యటనకు ముందు అతను తన ఫిట్నెస్ నిరూపించుకోవడానికి బెంగళూరులోని NCAకి వచ్చాడు. అయితే అక్కడ దురదృష్టవశాత్తు అతనికి కరోనా సోకింది. దాంతో రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్లతో కలిసి కేఎల్ రాహుల్ వెస్టిండీస్ పర్యటనకు వెళ్లలేకపోయాడు. అయితే తొలి మూడు టీ20ల తర్వాత కేఎల్ రాహుల్ అందుబాటులో ఉంటారనే ప్రచారం సాగింది. అయితే వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే సూచనలు కనిపించడం లేదని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa