ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమ్మో దొంగలు బైకులను అలా అమ్మేస్తున్నారటా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 27, 2022, 08:54 PM

ప్రతి దొంగకు ఓ  స్టైల్ ఉన్నట్లే విశాఖకు చెందిన ఓ దొంగల ముఠాది ప్రత్యేక స్టైల్ ఉంది. విశాఖలో బైక్ దొంగల ఆట కట్టించారు పోలీసులు. మద్యం, బైక్ రైసింగ్, జల్సాలకు అలవాటుపడిన ఈ గ్యాంగ్.. ఈజీ మనీ కోసం ఖరీదైన బైక్‌ల్ని టార్గెట్ చేసేవాళ్లు. ముందుగా బైక్‌లపై ఫోకస్ పెట్టేవాళ్లు.. పక్కా ప్లాన్ చేసి నిమిషాల్లో చాకచక్యంగా హ్యాండిల్ లాక్స్ విరగ్గొట్టి మాయం చేసేవాళ్లు. నగరంలోని పోలీస్ స్టేషన్ల పరిధిలో 15 బైక్లను దోచుకెళ్లారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను క్రైమ్ డీసీపీ వెల్లడించారు.


ఎంవీపీ కాలనీకి చెందిన శ్రీను ఈ నెల 16న రాత్రి ఇంటి ముందు బైక్ పార్క్ చేశాడు. మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు లేచి చూసేసరికి ఇంటి గేటు గొళ్లెం విరగ్గొట్టి కనిపించింది. ఇంట్లో ఉండాల్సిన మొబైల్, బైక్ తాళం కనిపించలేదు. వెంటనే బయటకు వెళ్లిన శ్రీను.. పార్క్ చేసిన బైక్ కూడా కనిపించలేదు. దీంతో అతను చుట్టుపక్కల వెతికినప్పటికీ దొరక్కపోవడంతో ఈ నెల 25న ఎంవీపీ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో బైక్‌లు కనిపించకుండా పోయాయని కొద్ది రోజులుగా పోలీస్ స్టేషన్లకు వరుసగా ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఏడాది మే నెల నుంచి ఇప్పటి వరకు నగరంలో ఎంవీపీ స్టేషన్‌లో 7. ఫోర్త్ టౌన్ పరిధిలో 4, ద్వారకా పీఎస్లో 2, ఆనందపురం, ఆరిలోవ స్టేషన్లలో ఒక్కో కేసు చొప్పున నమోదైంది.


ఇలా వరుసగా బైక్లు చోరీ అవడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. వరుస దొంగతనాలపై స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేశారు. బైక్ దొంగలపై నిఘా పెట్టి.. వీరిలో ప్రధాన నిందితుడు సెంట్రల్ రోడ్డు రామకృష్ణాపురం ప్రాంతానికి చెందిన బదిరెడ్డి సురేష్ కుమార్‌గా గుర్తించారు. అతడితో పాటు అదే ప్రాంతానికి చెందిన డుబ్బ రాంబాబు, సంపంగి దుర్గ సాయి, మారిక అప్పలరాజు, పతివాడ సంపత్ కుమార్ర్, వేపగుంట ప్రాంతానికి చెందిన షేక్ మహబూబ్ షుఖాని (22)లను చాకచక్యంగా


అరెస్ట్ చేశారు.


ఈ చోరీ చేసిన బైక్‌లను విడిభాగాలు అమ్మడానికి ప్రయత్నిస్తూ దొరికిపోయారు. ప్రధాన నిందితుడు సురేష్ కుమార్ చాలా కాలంగా బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్నారు. బైక్ హ్యాండిల్ లాక్ నిమిషంలోనే విరగ్గొట్టి, స్పీడో మీటర్‌ను పక్కకు తీసి లోపలి ఇగ్నీషన్ వైర్లను కలిపి వాహనాన్ని స్టార్ట్ చేయడంలో మేధావి. ఈ ఆరుగురు జల్సాలకు అలవాటుపడి ఈ నేరాలకు పాల్పడినట్లు డీసీపీ తెలిపారు. ఖరీదైన బైక్లను గుర్తించడం.. ముందుగా రెక్కీ వేసి రాత్రి సమయాల్లో చోరీ చేస్తున్నారు. ఈ బైకుల్ని సురేష్ తన ఇంటి వెనుక ఉన్న షెడ్డుకు తీసుకెళ్లి ఆ వాహనాలను గుర్తు పట్టకుండా చేయాల్సిన మార్పులు చేసేవాడు. ఆ వాహనాలతో నిందితులు రాత్రి సమయాల్లో బైక్ రేసింగ్లకు వెళ్లేవారు. అంతేకాదు చోరీ చేసిన బైక్ లను విడిభాగాలుగా చేసి వాటిని విక్రయించే సమయంలో పోలీసులు పట్టుకున్నారు. నగరంలో 15 బైక్లను చోరీ చేసినట్లు అంగీక రించారు. దీంతో వారి నుంచి ఆ 15 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకొని ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa