ఎవరు తీసిన గోతిలో వారే పడతారు అన్నట్లుగా.. ఇవాళ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు పలు కేసుల్లో ఈడీ చుట్టూ తిరుగుతున్నారని వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ విమర్శించారు. వాన్ పిక్ ప్రాజెక్టుపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు సోనియాగాంధీ, సి.బి.ఐ, చంద్రబాబు నాయుడుకు చెంపపెట్టు అని ఆయన పేర్కొన్నారు. ఆరోజు వైఎస్ జగన్ ప్రభంజనాన్ని అడ్డుకునేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న సోనియాగాంధీ, చంద్రబాబులు కలసి కుట్రపన్నారని ఆరోపించారు. తప్పుడు కేసులు పెట్టి వైఎస్ జగన్ను ఇరికించి ఇబ్బందులకు గురిచేశారని చెప్పుకొచ్చారు. అన్యాయంగా కేసుల్లో ఇరికించినా.. ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందని తెలుసుకోవాలన్నారు.
అధికారం ఉంది కదా అని ఈడీని అడ్డుపెట్టుకుని వైఎస్ జగన్నపై, తనపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారన్నారు. ఎవరు తీసిన గోతిలో వారే పడతారు అన్నట్లుగా.. ఇవాళ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు పలు కేసుల్లో ఈడీ చుట్టూ తిరుగుతున్నారన్నారు. తప్పుడు కేసులు పెట్టే ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. ఏనాటికైనా న్యాయం గెలుస్తుందని మొదటి నుంచి చెబుతున్నాము అన్నారు.
వాన్పిక్ కేసులో తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. సీబీఐ ఛార్జ్షీట్ చెల్లదని కోర్టు తేల్చింది.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు కోసం వాన్పిక్ ప్రాజెక్ట్స్కు భూములను కేటాయించారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భూముల కేటాయింపుపై సీబీఐ అధికారులు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై హైదరాబాద్ సీబీఐ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అయితే ఈ ఛార్జ్షీట్ చెల్లదంటూ వాన్పిక్ సంస్థ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు.. వాన్పిక్కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. వైఎస్ జగన్పై గతంలో సీబీఐ దాఖలు చేసిన అక్రమాస్తుల కేసుల్లో వాన్పిక్ కేసు ప్రధానమైంది. దీంతో సీఎం జగన్తోపాటు ఈ ప్రాజెక్టు ప్రమోటర్లలో ఒకరైన నిమ్మగడ్డ ప్రసాద్, ఇతరులకు హైకోర్టు తీర్పుతో ఊరట లభించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa