విజయవాడకు చెందిన దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్పై ఆంక్షలు విధిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. క్యాష్ విత్డ్రాయెల్స్పై పరిమితులు విధించింది. మూడు కోఆపరేటివ్ బ్యాంకులకు ఈసారి షాకిచ్చింది. బ్యాంకుల ఆర్థిక పరిస్థితి క్షీణిస్తూ రావడం ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. అందుకే కఠిన ఆంక్షలు తీసుకువచ్చింది. బస్మంత్ నగర్ కేంద్రంగా సేవలు అందిస్తున్న జైప్రకాశ్ నారాయణ్ నగరి సహకారి బ్యాంక్, సోలాపూర్ కేంద్రంగా సేవలు అందిస్తున్న కర్మలా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్, విజయవాడకు చెందిన దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్పై ఆంక్షలు విధిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది.
జైప్రకాశ్ నారాయణ్ నగరి సహకారి బ్యాంక్పై ఆంక్షలు విధించడం వల్ల ఇకపై ఈ బ్యాంక్ కస్టమర్లకు వారి ఖాతాల నుంచి డబ్బులు విత్డ్రా చేసుకోలేరు. ఆర్బీఐ ఒక నోటిఫికేషన్లో ఈ విషయాన్ని వెల్లడించింది. అలాగే కర్మలా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్పై ఆంక్షలు వేసినట్లు ఆర్బీఐ తెలిపింది. ఈ బ్యాంక్ కస్టమర్లు వారి ఖాతాల నుంచి రూ. 10 వేల వరకు మాత్రమే డబ్బులు విత్డ్రా చేసుకోవడం వీలవుతుంది.
అలాగే విజయవాడకు చెందిన దుర్గా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్పై కూడా ఆర్బీఐ ఆంక్షలు వేసింది. ఈ బ్యాంక్లో అకౌంట్ ఉన్న వారు రూ. 1.5 లక్షల వరకు డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లో భాగంగా ఈ ఆంక్షలు విధించినట్లు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఆర్బీఐ విధించిన ఈ ఆంక్షలు ఆరు నెలల వరకు అమలులో ఉంటాయి.
ఆర్బీఐ క్రమనుగతంగా బ్యాంకుల పనితీరును పరిశీలిస్తూ వస్తోంది. బ్యాంక్ ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా ఉంటే.. ఆంక్షలను ముందే ఎత్తివేయొచ్చు. లేదంటే మరికొంత కాలం పొడిగించే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండా ఈ బ్యాంకులు ఆర్బీఐకి తెలియకుండా రుణాలు ఇవ్వడం, ఇన్వెస్ట్మెంట్లు చేయడం, డిపాజిట్లు స్వీకరించడం వంటివి చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ముందుగా ఆర్బీఐ అనుమతి తీసుకోవాలని సూచించింది. అంతేకానీ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేయలేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. అందువల్ల బ్యాంక్ కస్టమర్లకు కంగారు పడాల్సిన పని లేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa